ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ఎ స్. శేఖర్
విశాలాంధ్ర _అనకాపల్లి: యోగాంధ్ర సందర్భంగా అనకాపల్లి జోన్ లో మంచినీటి సరఫరాను నేడు అనగా శనివారం మధ్యాహ్నం 12 గంటల తరవాతే చేయబడుతుందని మంచి నీటి విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్. శేఖర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మంచినీటి సరఫరా జరిగేదని అయితే 21 శనివారం మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు తర్వాత సరఫరా చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని అనకాపల్లి జోన్ ప్రజలు గమనించాలని ఆయన కోరారు.