విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
విశాలాంధ్ర నందిగామ:-అగ్ని ప్రమాదంలో అన్ని పోగొట్టుకున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు పట్టణ పరిధిలోని ఆరో వార్డులో నివాసం ఉంటున్న తమ్మిశెట్టి ఎలమందయ్య స్వగృహం అగ్నికి ఆహుతిఐ ఇంటిలో ఉన్న సామాను కాలిపోవడం జరిగింది అగ్ని ప్రమాద విషయాన్ని తెలుసుకున్న వెబ్ ఎమ్మెల్యే తంగరాల సౌమ్య స్థానిక ఆరో వార్డు ఇంచార్జ్ లాయర్ కరిముల్లా, మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి స్థానిక ఓటమినేతలతో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించారు అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు వెంటనే సంబంధిత అధికారులను ఆమె అగ్నిప్రమాదంలో దగ్ధమైన పరికరాల వస్తువు ఇంటి సామాగ్రిని అంచనాలు వేయాలని ఆదేశించారు అగ్నిమాపక శాఖ రెవెన్యూ అధికారులు సమన్వయంతో సత్వరం ఆ కుటుంబానికి మేలు జరిగేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు…