ఇస్కాన్ టెంపుల్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శారద నగర్ మార్కెట్ యార్డ్ పక్కన గల ఇస్కాన్ టెంపుల్ లో జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా పూరీ జగన్నాథ స్వామికి స్నాన యాత్ర మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ధర్మవరం ఇంచార్జ్ కృష్ణ మాధవ్దాస్ ప్రభుజి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒరిస్సాలోని పూరి క్షేత్రంలో స్నాన యాత్ర మహోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు పాటు హరినామ సంకీర్తన వివిధ రకాల నైవేద్యాలు భగవంతునికి సమర్పించడం జరిగిందన్నారు. అనంతరం ప్రవచనం చెప్పి అందరిని జగన్నాథ స్వామి వైపు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు
ఘనంగా స్నాన యాత్ర మహోత్సవ వేడుకలు
RELATED ARTICLES