Friday, June 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగొట్లూరులో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభం

గొట్లూరులో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం ప్రారంభం

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో వ్యవసాయ శాఖ వారు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేలను, పాడి పశువులను, యంత్రాలను పూజించుకునే సాంప్రదాయం మన దేశ వ్యవసాయం యొక్క గొప్పతనాన్ని కొనయాడటంజరిగింది అని తెలిపారు.
ఖరీఫ్ 2025 కు సంబంధించి సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమం గొట్లూరు గ్రామం సచివాలయం వద్ద ప్రారంభించారు.
ఎస్ ఎం ఏ యం పథకం ద్వారా రైతులకు 50 శాతం రాయితీపై యంత్ర పరికరాలు సరఫరా చేయడం జరిగిందనితెలిపారు. అలాగే భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడుకోవడం వల్ల ప్రజల ఆరోగ్యం కాపాడుకోవలసిందిగా సూచించడం జరిగింది అన్నారు. అలాగే వ్యవసాయంలో రైతు ఉత్పత్తి సంఘాల యొక్క ప్రాముఖ్యతను ఆవశ్యకతను వివరించడం జరిగింది అని తెలిపారు. రైతు కూలీల యొక్క ఆరోగ్యం కాపాడుకోవడానికి , పంట సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి సరైన సమయంలో పురుగు మందులు పిచికారి చేసుకోవడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రైతులను కోరారు. ఈ అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వర్షాలు పుష్కలంగా కురవాలని రైతులకు మంచి జరగాలని ఆకాంక్షీస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వైవి సుబ్బారావు , వేరుశనగ సబ్సిడీ వివరాలు తెలియజేయడం జరిగింది అని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతుల సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అంబటి అరుణశ్రీ ,ఏపీ సీడ్ డైరెక్టర్ కాటమయ్య, ఆర్డిఓ మహేష్ , డిహెచ్ఓ చంద్రశేఖర్ గ,ఏపీఎంఐపి పిడి సుదర్శన్ ఏడిఎ సనావుల్లా, ఏవోలు ముస్తఫా, రమాదేవి, ఓబిరెడ్డి, రవీంద్ర ,ఎంపీడీవో సాయి సాయి మనోహర్ , మండల వ్యవసాయ అధికారి ముస్తఫా, బిజెపి మండలాధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ,ఏ ఈ ఓ లు అశ్విని ,మురళి ,ఉపేంద్ర వీహెచ్ ఏలు చరిత్ ,గీతాంజలి, రైతు సేవా కేంద్ర సిబ్బంది మండల నాయకులు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు