Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఘనంగా రక్తపోటు దినోత్సవం..

ఘనంగా రక్తపోటు దినోత్సవం..

జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పద్మమ్మ.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొత్తపేటలో 36వ సచివాలయం పరిధిలో ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పద్మమ్మ, జిల్లా ఏపీ బీయాలజిస్ట్ బాలాజీ నాయక్, వైద్యాధికారి ప్రియాంక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంకరమిత వ్యాధులు అసంక్రమిత వ్యాధులు సర్వేను పరిశీలించి ప్రజల నుంచి అభిప్రాయాలను అడిగి వారితో చర్చించడం జరిగిందని తెలిపారు. ప్రపంచ లో రక్త పోటు అందరికీ వస్తుందని వీటిపై ప్రజలు అవగాహన చేసుకున్నప్పుడే రోగమును నివారించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు