Friday, April 18, 2025

ఘనంగా గ్రీన్ డే

విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని నాగులూరు గ్రామంలో గల
రూపా రాజా పీసిఎంఆర్ పాఠశాలలో ఘనంగా గ్రీన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులంతా ఆకుపచ్చ రంగు దుస్తులతో అలరించిన వైనం అందరిని ఆకట్టుకుంది. పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ విద్యార్థులతో కలిసి చెట్లు నాటారు.ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ హర్షవర్ధన్ మాట్లాడుతూ.సకల జీవరాశులు మానవ జాతి సుఖంగా బ్రతకాలంటే, ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం మానవజాతికి ఎంతైనా ఉందని తెలిపారు.పొల్యూషన్ గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు ఇప్పటికైనా ఆక్సిజన్ ఎక్కువ ఉత్పత్తి చేసే చెట్లను ప్రతి ఒక్కరూ విరివిగా పెంచి వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు.లేకపోతే మానవజాతి మనగుడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ రూప రాజా కృష్ణ, జగదీష్, కరస్పాండెంట్ నాగమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ నరేష్ కుమార్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు