తెలంగాణలో మరో నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.దేశం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెళ్లిపోయినా, ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత వర్షాలు పడే అవకాశం ఉంది.హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ఈ నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ను ఆ జిల్లాలకు జారీ చేసింది.
వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
వర్షాలు కురిసే జిల్లా వివరాలు
శనివారం
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్
ఆదివారం
కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్
సోమవారం
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల
వాతావరణ శాఖ ప్రజలకు సూచనలు
వర్షాలు పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలి.భారీ వర్షం పడే సమయంలో అత్యవసర పరిస్థితి కాకుండా బయటకు వెళ్లకూడదు.బయటకు తప్పనిసరిగా వెళ్లాల్సి వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఈదురుగాలులు, పిడుగులులిలి ఉన్న సందర్భంలో చెట్ల కింద ఉండకూడదు.
హోర్డింగ్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిలబడకూడదు.


