Homeజాతీయందేశమంతా వర్షాభావం.. ఈ ఎడారిలో మాత్రం అధిక వర్షపాతం !

దేశమంతా వర్షాభావం.. ఈ ఎడారిలో మాత్రం అధిక వర్షపాతం !

- Advertisement -

దేశంలో జూన్ 4-17 మధ్య 40 శాతం వర్షాభావం

లడఖ్‌లో మాత్రం సాధారణం కంటే 96 శాతం అధిక వర్షపాతం
హిమాలయ ప్రాంతాల్లో మారుతున్న వాతావరణ ధోరణులపై ఆందోళన

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు ఆశించినంత వేగంగా ముందుకు సాగకపోవడంతో అనేక రాష్ట్రాలు వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి. జూన్ 4 నుంచి 17 వరకు దేశంలో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఇదే సమయంలో హిమాలయాల్లోని ఎడారి ప్రాంతం లడఖ్ మాత్రం భిన్నమైన పరిస్థితిని చవిచూసింది.భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా గణాంకాల ప్రకారం లడఖ్‌లో 2.2 మిల్లీమీటర్ల వర్షం పడాల్సి ఉండగా 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణం కంటే 96 శాతం ఎక్కువ. దేశవ్యాప్తంగా వర్షాల కొరత నెలకొన్న సమయంలో లడఖ్‌లో దాదాపు రెట్టింపు వర్షం కురవడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో వర్షాల లోటు 60 శాతం నుంచి దాదాపు 100 శాతం వరకు నమోదైంది. దేశవ్యాప్తంగా చూస్తే జూన్ 4 నుంచి 17 వరకు సాధారణంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాలి. కానీ ఈసారి కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షమే కురిసింది.

వాతావరణ నిపుణుల ప్రకారం ఉత్తర భారతదేశం మీదుగా కదిలిన పశ్చిమ అలజడులు (ఔవstవతీఅ ణఱstuతీbaఅcవs), పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన తేమ ప్రభావంతో లడఖ్‌లో వర్షాలు కురిశాయి. సాధారణంగా జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలు నైరుతి రుతుపవనాలపై ఆధారపడతాయి. కానీ లడఖ్ వాతావరణం మాత్రం పశ్చిమ అలజడులు, అక్కడి భౌగోళిక పరిస్థితుల ప్రభావానికి ఎక్కువగా లోనవుతుంది.

లడఖ్‌లో నమోదైన 4.3 మిల్లీమీటర్ల వర్షం దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువగానే కనిపించవచ్చు. కానీ సాధారణంగా పొడి వాతావరణం ఉండే ఆ ప్రాంతానికి అది గణనీయమైన పెరుగుదలగా పరిగణిస్తున్నారు.

ఆందోళన కలిగిస్తున్న మార్పు
హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయన్న ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. గతంలో ఎక్కువగా మంచు కురిసే లేదా పొడి వాతావరణం ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు తరచూ వర్షాలు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇలాంటి మార్పుల వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, హిమ సరస్సులు తెగిపోవడం వంటి ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే దేశంలోని మిగతా ప్రాంతాలకు త్వరలో ఉపశమనం లభించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. జూన్ 20 తర్వాత అరేబియా సముద్రం నుంచి తేమ ప్రవాహం పెరగడంతో వర్షాలు క్రమంగా ఊపందుకునే అవకాశముందని పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు