Wednesday, June 4, 2025
Homeఆంధ్రప్రదేశ్రేషన్ డీలర్లు తప్పు చేస్తే.. ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది

రేషన్ డీలర్లు తప్పు చేస్తే.. ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది

రేషన్ డీలర్లకు కమీషన్లు పెంచేందుకు కృషి చేస్తానన్న శ్రీరామ్
విశాలాంధ్ర -ధర్మవరం; ఎక్కడైనా రేషన్ డీలర్లు బియ్యం సక్రమంగా సరఫరా చేయకపోతే.. ఆ చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుందని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ అన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో పాత విధానంలో రేషన్ పంపిణీని పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేష్ తో పాటు పౌరసరఫరాల శాఖ అధికారులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పేదలకు రేషన్ బియ్యాన్ని పరిటాల శ్రీరామ్ స్వయంగా అందజేశారు. అలాగే కొందరు వృద్ధులకు నేరుగా ఇంటికి వెళ్లి రేషన్ అందించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఒకప్పుడు రాష్ట్రంలో 39 శాతం మంది పేద కుటుంబాలకు తెల్ల బియ్యం అంటే తెలిసేది కాదన్నారు. ఏదో పండగ ఉంటే తప్ప బియ్యం వండే పరిస్థితి ఉండేది కాదన్నారు. కానీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద కుటుంబాలకు తెల్ల బియ్యం అందించారని గుర్తు చేశారు. ఆయన తీసుకొచ్చిన ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ నేటికీ కొనసాగుతోందన్నారు. కాలక్రమంలో రేషన్ పంపిణీలో అనేక మార్పులు చేశారన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా గతంలో పరిటాల సునీత పౌరసరఫరాలశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ-పాస్ మిషన్లు తీసుకొచ్చారన్నారు. అప్పుడు కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేశారన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎండియు వాహనాలను తీసుకొచ్చారని… దీని ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తామన్నారన్నారు. కానీ 1600 కోట్లు ఖర్చుచేసినా అది నెరవేరకపోగా.. రేషన్ బియ్యం పెద్ద ఎత్తున పక్కదారి పట్టిందని శ్రీరామ్ అన్నారు. ఈ విధానాన్ని కట్టడి చేసేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ప్రభుత్వం మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కొత్త మార్పులు తీసుకొచ్చారని అన్నారు. అందుకే పాత విధానంలోనే రేషన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. ధర్మవరం నియోజకవర్గ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదేండ్ల మనోహర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి నెలలో 15 రోజులు పాటు రేషన్ పంపిణీ రెండు పూటలా పంపిణీ చేస్తారన్నారు. ఐదు రోజులు పాటు వృద్ధులు, వికలాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ అందిస్తారన్నారు. ఇది రేషన్ డీలర్లకు కొంత ఇబ్బందికరమైనప్పటికీ ప్రభుత్వం మంచి ఉద్దేశంతో చేసే కార్యక్రమాలకు సహకరించాలన్నారు. డీలర్లకు గోదాం నుంచి రేషన్ దుకాణాలకు వచ్చే సమయానికి ఎక్కువగా నష్టం ఉంటుందని.. దీనిని నివారించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వారికి బియ్యం తక్కువగా వస్తే ప్రజలకు అది పరోక్షంగా నష్టం చేకూరే అవకాశం ఉందన్నారు. మరోవైపు 15 రోజులు పాటు రేషన్ పంపిణీ ఉన్న కారణంగా డీలర్లకు కమీషన్ పెంపు లేదా వేతనం రూపంలో వారికి సాయం అందాల్సిన అవసరం ఉందని… దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆర్డిఓ మహేష్ ని కోరారు. రేషన్ డీలర్లు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని శ్రీరామ్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నటరాజ్, రెవెన్యూ సిబ్బంది, స్టోర్ డీలర్లు, టిడిపి నాయకులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు