గురువు డాక్టర్.ఆర్. మానస
విశాలాంధ్ర ధర్మవరం: శ్రీకాళహస్తిలో జరిగిన కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ఎస్బిఐ కాలనీకి చెందిన మానస నృత్య కళా కేంద్రం వారి శిష్య బృందం నిర్వహించిన నిత్య ప్రదర్శన అక్కడ అందరిని ఆకట్టుకోవడం జరిగిందని గురువు డాక్టర్. ఆర్. మానస తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఆలయ కమిటీ వారితోపాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు మాకు ఆహ్వానం పంపించడం జరిగిందని, దైవకార్యం మా వంతుగా ఒక అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావించి అక్కడ వెళ్లి నాట్య ప్రదర్శన నిర్వహించడం జరిగిందని తెలిపారు. నాట్య ప్రదర్శనలో మా ద్వారా ఆన్లైన్లో 25 మంది ప్రత్యక్షంగా నేర్చుకున్న నలుగురు మొత్తం విరిసి 29 మంది శిష్య బృందం నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈనాట్య ప్రదర్శనలో శివతాండవం, శివాష్టకం, మహాగణపతి, తిల్లనా అనే నాట్య ప్రదర్శనలు అక్కడి భక్తాదులను విశేషంగా ఆకట్టుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ధర్మవరం ద్వారా నాట్య ప్రదర్శన చేసిన తనుష్క, రేఖ, గౌతమి, శాంది లతోపాటు ఆన్లైన్లో నేర్చుకున్న వారు కూడా ఈనాటి ప్రదర్శన నిర్వహించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. తదుపరి ఆలయ కమిటీ వారు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు కలిసి నాట్య ప్రదర్శన చేసిన వారందరితో పాటు గురువు మానసాను కూడా ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శనలు చేసిన వారితోపాటు మానస తల్లిదండ్రులు కృష్ణ, తులసి కూడా పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ధర్మవరం నృత్య ప్రదర్శన
- Advertisement -
RELATED ARTICLES


