విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీ మారుతీ రాఘవేంద్ర స్వామి దేవస్థానంలో తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా, అందరినీ ఉత్సాహపరిచేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీకు చెందిన మానస నృత్య కళా కేంద్రం వారి ఆధ్వర్యంలో ప్రత్యేక నిత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో గురువు మానస నిత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. నిత్య ప్రదర్శన అనంతరం గురువు మానసను ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, పట్టణ ప్రముఖులు సందా రాఘవ చేతులు మీదుగా ఘనంగా సత్కరించారు. తదుపరి నాట్యం చేసిన చిన్నారులకు జ్ఞాపకాలు అందజేశారు. పరిటాల శ్రీరామ్, సందా రాఘవ మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మానస ఇటువంటి నాట్య ప్రదర్శన ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయమని తెలుపుతూ మానసను అభినందించారు.
ఆకట్టుకున్న మానస నృత్య కళా కేంద్రం ప్రదర్శన
RELATED ARTICLES