విశాలాంధ్ర -తనకల్లు : పర్మినెంట్ డిజేబుల్ పెన్షన్ పై ఎంపీడీవో పూల నరసింహులు విచారణ చేపట్టారు మండల పరిధిలోని కంసాని వారి పల్లి గ్రామానికి చెందిన ఎం నారాయణరెడ్డి పర్మినెంట్ డిజేబుల్ పెన్షన్ నెలకు 15000 రూపాయలు పొందుతున్నారు కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు కంసాని వారి పల్లి కి వెళ్లి పెన్షన్ పై విచారణ చేయగా 60% గా ఉన్న వికలత్వం పత్రాలు మాత్రమే ఉన్నాయని గుర్తించారు.పర్మినెంట్ డిజేబుల్ పెన్షన్ పై నివేదిక తయారు చేసి ఉన్నతా ధికారులకు పంపుతున్నట్లు ఎంపీడీవో తెలిపారు.