విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కళాజ్యోతిలో నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్వసభ్య సమావేశమును ఏర్పాటు చేసుకోగా, ఈ సమావేశంలో కుంటిమల నారాయణను ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అనంతరం అధ్యక్షులు ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడంలో భాగంగా గౌరవ అధ్యక్షులుగా పి. వెంకటనారాయణ, గౌరవ సలహాదారులుగా ఎస్. రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా జగ్గా వేణుగోపాల్, కార్యదర్శిగా బాలకొండ రామకృష్ణ, సంయుక్త కార్యదర్శిగా పాగాల అశ్వత్థ నారాయణ, కార్యవర్గ సభ్యులుగా కే. రమేష్ బాబు, గూడూరు మోహన్దాస్, డి. రాంప్రసాద్ ,జి .పెద్దారెడ్డి, కె. మధుసూదన్ ,సి. రామన్న ,టి. సూర్యనారాయణ రెడ్డి, మాయ కుంట్ల ఆదినారాయణ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ వారు మాట్లాడుతూ కళాజ్యోతి చేస్తున్న వివిధ కార్యక్రమాలను మరింత అభివృద్ధి దిశలో వెళ్లేందుకు తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.
కళాజ్యోతి నూతన కమిటీ ఏర్పాటు
RELATED ARTICLES