Friday, May 16, 2025
Homeజాతీయంకీల‌క ప‌రిణామం.. తాలిబ‌న్ విదేశాంగ మంత్రితో జైశంక‌ర్ చ‌ర్చ‌లు

కీల‌క ప‌రిణామం.. తాలిబ‌న్ విదేశాంగ మంత్రితో జైశంక‌ర్ చ‌ర్చ‌లు

భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల వేళ కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. చ‌రిత్ర‌లోనే తొలిసారి ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబ‌న్ ప్ర‌భుత్వంలో తాత్కాలిక విదేశాంగా మంత్రిగా ఉన్న ఆమిర్‌ఖాన్ ముత్తాఖీతో భార‌త విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ఎస్ జైశంక‌ర్ ఫోన్‌లో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిని తాలిబ‌న్లు ఖండించ‌డాన్ని జైశంక‌ర్ స్వాగ‌తించారు. తాలిబ‌న్ల‌తో తాను మాట్లాడిన విష‌యాన్ని మంత్రి జైశంక‌ర్ ఃఎక్స్ః (గ‌తంలో ట్విట్ట‌ర్‌) ద్వారా వెల్ల‌డించారు. కాగా, తాలిబ‌న్ ప్ర‌భుత్వంతో న్యూఢిల్లీ మంత్రిత్వ‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు