Friday, June 13, 2025
Homeజిల్లాలుఅనంతపురంఉద్యోగ ఉపాధి నిరుద్యోగ భృతి కై పోరాడుదాం…

ఉద్యోగ ఉపాధి నిరుద్యోగ భృతి కై పోరాడుదాం…

అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్..

విశాలాంధ్ర అనంతపురం : ఉద్యోగ ఉపాధి నిరుద్యోగ భృతి కై పెద్ద ఎత్తున పోరాల్సిన అవసరం ఉందని అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ పిలుపునిచ్చారు.
అఖిల భారత యువజన సమాఖ్య ఈ సంద్భంగా ఏఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశాన్ని శుక్రవారం అనంతపురం నీలం రాజశేఖర్ రెడ్డి భవనం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర నాయకులు ప్రస్తుత సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాఫర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ మిత్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో “20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం”, “యువతకు ఉపాధి హామీ”, “నిరుద్యోగ భృతి అందిస్తాం” అనే ఎన్నో వాగ్దానాలు చేశారన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని వాస్తవం ప్రజలందరికీ తెలిసింది అన్నారు.
అనంతపురం జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది యువత నిరుద్యోగతతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఉద్యోగ పరీక్షలు నోటిఫికేషన్లే రావడం లేదన్నారు. వచ్చినవాటిలో ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, కొంతమంది ఉత్తీర్ణులైనా కూడా వారి నియామకాలు ఆగిపోయాయన్నారు.
నిరుద్యోగ భృతి అన్నదీ వాస్తవానికి దూరంగా ఉందని, దరఖాస్తులు తీసుకున్నప్పటికీ ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం ఇవ్వలేదన్నారు. . ఇది రాష్ట్ర యువతను మోసం చేయడమే కాక, వారి భవిష్యత్తుతో చిలగాటమాడుతున్న ప్రభుత్వాన్ని వాస్తవాలు చెబుతూ నిలదీయాలన్నారు. యువత సమస్యలను ను పత్రికా మాధ్యమాల్లో వెలుగులోకి తీసుకురావాలి కోరారు..
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ… 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించకుండ యువతను పూర్తిగా మోసం చేసిందన్నారు. తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అలా కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి నెలకు 3000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అధికారం చేపట్టి ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న తను అధికారం చేపట్టడానికి కారణమైన నిరుద్యోగులను విస్మరించి కేవలం 16,423 పోస్టుల తో డీఎస్సీ నోటిఫికేషన్ తప్ప మరే ఉద్యోగాల గురించి ఆలోచించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ఇప్పటికీ నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని కానీ ముఖ్యమంత్రి కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగుల కల్పన నిరుద్యోగ భృతి సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోవడానికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 15 నుండి జులై 15 వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది నుండి సంతకాల సేకరించి నిరుద్యోగుల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్ష ఆందోళన నిర్వహించి ఉద్యోగమా?, నిరుద్యోగ భృతి? సాధించేంతవరకు ఉద్యమాల కొనసాగిస్తామని దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హనుమంతు, కుళాయి స్వామి, ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శులు ధనుంజయ, దేవా,జిల్లా కోశాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు