Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి

విశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయాలు విజ్ఞాన బాండారాలు అని, గ్రంధాలయాలు నిరుద్యోగులకు, అదేవిధంగా విద్యార్థులకు నైపుణ్యమును పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి ఈ సందర్భంగాపట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగు, ఆంగ్లము, యోగ, తెలుగు వ్యాకరణం, ఆంగ్ల గ్రామర్, తెలుగు పద్యాల పై శిక్షణా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ యోగ, ఆటల మంచి మెలకువలను తెలుసుకోవాలని తెలియజేశారు. చదువుట, రాయుట,ఇంగ్లీష్ గ్రామర్, విషయాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. వివిధ పోటీ పరీక్షలకు చిన్నతనం నుండే అభ్యసించాలని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందని తెలిపారు. శిక్షణ తరగతులలో నాట్యాలు, వివిధ ఆటలు వల్ల చక్కటి ఆరోగ్యము, శరీర దృఢత్వం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగిందని తెలిపారు. తదుపరి యోగ వ్యాయామం కూడా చేయించడం జరిగిందన్నారు. ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు