Tuesday, April 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమానస నృత్య కళా కేంద్రం వారికి అవార్డుల పంట…

మానస నృత్య కళా కేంద్రం వారికి అవార్డుల పంట…

గురువు మానస
విశాలాంధ్ర -ధర్మవరం : ధర్మవరం పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో ఉంటున్న మానస నృత్య కళాకేంద్రం వారికి ఈ నెల 13వ తేదీ ఆదివారం హైదరాబాదులోని రవీంద్ర భారతి నందు సిరి ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించినటువంటి ఆల్ ఇండియా డాన్స్ అండ్ మ్యూజిక్ వేస్ట్ -2025 కార్యక్రమంలో అవార్డులను కైవసం చేసుకోవడం జరిగిందని గురువు మానస తెలిపారు. తదుపరి శిష్య బృందం ఆలపించిన నాట్యం అందర్నీ అబ్బురపరిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ. కృష్ణయ్య, తదుపరి దైవేజ్ఞ శర్మ చేతుల మీదుగా గురువు మానసకు కళా భూషణ అవార్డు, అయోధ్య రామ అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు. తదుపరి శిష్య బృందానికి బాలగోపాలకృష్ణ అవార్డును ఇచ్చి, ప్రశంసా పత్రాలు, మెమొంటోలను బహుకరించారు. గురువు మానస మాట్లాడుతూ సిరి ఆర్ట్స్ అకాడమీ వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను నేర్చుకున్న నృత్యమును పదిమందికి నేర్పించి, విస్తరింప చేయడమే నా లక్ష్యము అని తెలిపారు. నాకు ఇచ్చిన ఈ అవార్డులు కళాకారులకు, ధర్మవరం ప్రజలకు, నా తల్లిదండ్రులకు, గురువుకు అంకితం చేస్తున్నట్లు వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు