విశాలాంధ్ర -ధర్మవరం;; గ్రంథాలయాల తో విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, విద్యార్థులుకు ధ్యాన యోగా ఎంతో అవసరమని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ కార్యక్రమాలు లో భాగంగా నాలుగవ రోజు విద్యార్థులకు ధ్యాన యోగ పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వివరించడం జరిగిందన్నారు. పిల్లలకు కథలు చెప్పడం చదివించడం జరిగిందన్నారు. తదుపరి విద్యార్థులకు ధ్యాన యోగ ను ప్రయోగాత్మకంగా నిర్వహించడం జరిగిందన్నారు. తదుపరి విద్యార్థులకు అవసరమైన వివరాలను ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెన్నెల వివరించడం జరిగింది అని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలోవిద్యార్థులకు కావలసిన అన్ని అంశాలపై ఈ శిక్షణా శిబిరాలు ఉంటాయని తెలిపారు. 33 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ధ్యాన యోగ ఎంతో అవసరం. అంజలి సౌభాగ్యవతి
RELATED ARTICLES