Tuesday, June 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిదేశంలో చిక్కుకున్న యువకుడుని సురక్షితంగా స్వదేశానికి రప్పించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

విదేశంలో చిక్కుకున్న యువకుడుని సురక్షితంగా స్వదేశానికి రప్పించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

విశాలాంధ్ర -ధర్మవరం ; గత కొన్ని నెలల కిందట ఉపాధి కొరకు సౌదీ అరేబియాకు పట్టణానికి చెందిన సయ్యద్ ఫరూక్ వెళ్లడం జరిగింది. కానీ అక్కడ ఉపాధి లేకపోగా అనేక ఇబ్బందులు పడుతూ తినడానికి తిండి లేక, అనారోగ్యాల పడి ఇబ్బంది కావడంతో, ఆ క్షణంలో సయ్యద్ ఫారూఖ్ ఒక వీడియోను పంపడం జరిగింది. ఆ వీడియో వైరల్ కావడంతో, సమాచారం అందుకున్న నియోజకవర్గ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు ద్వారా మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వెంటనే పంపడం జరిగింది. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకొని సౌదీ అరేబియా నుంచి ఇండియాకు సయ్యద్ ఫారూఖ్ను మంత్రి తీసుకొని వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. పుట్టపర్తికి చెందిన ఓ ప్రైవేటు ఏజెంట్ ద్వారా డ్రైవర్ ఉద్యోగం కోసం నమ్మి సౌదీలోకి వెళ్లిన ఫారుక్ బలవంతపు గృహ పనులు చేయించడమే గాక ఆహారము నివాసము లేకుండా జీతాలు ఇవ్వకుండా నరకయాతన అనుభవించడం జరిగిందని బాధితుడు తెలిపారు. అంతేకాకుండా హరీష్ బాబుకు అప్పట్లోనే వీడియో ద్వారా వినిపించడం జరిగింది. మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి తగు చర్యలు తీసుకొని విదేశాంగ మంత్రి, దేశ రక్షణ మంత్రి తదితరులతో చర్చించి చట్టపరంగా సయ్యద్ ఫరూకులు ధర్మవరంకు చేర్చడం జరిగింది. దీంతో సయ్యద్ ఫరూక్ మంత్రి కార్యాలయానికి వచ్చి మంత్రికి సెల్ ఫోన్ ద్వారా, నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు కు నేరుగా కృతజ్ఞతలు తెలియజేశారు. జూన్ 22 కు భారతకు రాగా జూన్ 23న ధర్మారంలోకి రావడం జరిగిందని తెలిపారు. అనంతరం సయ్యద్ ఫరూక్ మాట్లాడుతూ మంత్రి సహకారం లేకపోతే నేను జీవించే వాడినే కాదు అని నా జీవితాన్ని రక్షించిన ఆయన దేవుడు లాంటి వారు అని తెలిపారు. అనంతరం హరీష్ బాబు మాట్లాడుతూ భారతీయుల భద్రత కోసం బిజెపి ప్రభుత్వం ఎప్పుడు నిలబడి ఉంటుందన్న దానికి ఇది ఒక ప్రత్యక్ష సాక్షము అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు