ఆనందోత్సాహాలతో తల్లి పిల్లలు
విశాలాంధ్ర- శింగనమల : ‘ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆనందం’
శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం మండలం కడవకల్లు గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన “తల్లికి వందనం”పథకం అర్హులైన ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది. గ్రామంలో ప్రతి ఇంట ఆనందం వ్యక్తం చేశారు. కకడవకల్లు గ్రామ టిడిపి నాయకుడు గోవర్ధన్ రాజు నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రాజు మాట్లాడుతూ కూటం ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని తల్లికి వందనం పథకం ప్రారంభించిన అనుక్షణం తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కావడంతో తల్లి పిల్లలు ఆనందోత్సాహాలతో మునిగితేలుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.