జిల్లా సిపిఐ కార్యదర్శి సి. జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం: పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో మురళి నాయక్ వీరమరణం పొందడం బాధాకరమని అనంతపురం జిల్లా సిపిఐ కార్యదర్శి సి. జాఫర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేర్కొన్నారు. శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలం పుట్ట గుండ్లపల్లి తాండకు చెందిన మురళి నాయక్ మురళి నాయక్ స్థానిక శ్రీ వాణి పిజి డిగ్రీ కళాశాలలో 2019 నుంచి 22 వరకు బీకాం పూర్తి చేశాడన్నారు. బికాం చదువుతూనే ఎన్ సి సి చురుకుగా పాల్గొనడం జరిగిందన్నారు. డిగ్రీ మూడో సంవత్సరంలోనే అతను ఆర్మీలో స్థానం సంపాదించారన్నారు. దేశం కోసం వీరుని మరణం పొందడం మనసు కనిచివేసింది అన్నారు. మురళి నాయక్ వీరమరణం తెలుగు ప్రజలకే గాక దేశ ప్రజలందరికీ స్ఫూర్తి దాయకమన్నారు. మురళి నాయక్ పవిత్ర ఆత్మకు వారి కుటుంబానికి సిపిఐ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.