Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసంక్రాంతిని తలపించే విధంగా ముగ్గుల పోటీల నిర్వహణ..

సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గుల పోటీల నిర్వహణ..

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; సంక్రాంతిని తలపించే విధంగా ముగ్గుల పోటీల నిర్వహణను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుపరిపాలన మొదలై ఏడాది, దుర్మార్గపు పాలన అంతమై ఏడాది అయిన సందర్భంగా జనసేన పార్టీ తరఫున వేడుకలను నిర్వహించడం జరిగిందన్నారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలకు జడ్జీలుగా దుత్తలూరు కమలా బాలాజీ, దుత్తలూరు అనిత సారథి, రామ లారీత్యాల పర్యవేక్షణలో జరిగాయన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు ప్రథమ బహుమతిగా 5000 రూపాయలు సునీతకు, ద్వితీయ బహుమతిగా 2000 రూపాయలు నవ్య రెడ్డి, హనీలకు, ఇండియా బహుమతిగా 1000 రూపాయలను తేజస్విని ,పద్మజ ,మమత, లక్ష్మీదేవి లకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. శబరి పాలన మొదలై ఏడాది పూర్తి చేసుకోవడం సంతోషకరమని, ముఠా మీ ప్రభుత్వం అనేక విజయాలను సాధించడంతోపాటు రాష్ట్రానికి రాజధాని నిర్మాణం పోలవరం, ప్రాజెక్ట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటు అనేక సంక్షేమ పథకాలను సంవత్సర కాలంలోనే ప్రజలకు అందించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజును వెన్నుపోటు దినంగా ప్రకటించడం దుర్మార్గమైన చర్య అని వారు తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు