Friday, June 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యం..

నియోజకవర్గ అభివృద్ధి మా లక్ష్యం..

ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్
విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గ అభివృద్ధి యే మా లక్ష్యము అని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఎన్డీఏ కార్యాలయంలో విద్యుత్, రహదారులు, వైద్య రంగాలపై సమీగ్ర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధర్మవరం అభివృద్ధికి శాఖల సమన్వయంతో వేగవంతం చేయాలని తెలిపారు. పల్లె ప్రగతికి రహదారులు, ప్రజా ఆరోగ్యానికి ఆసుపత్రులు, సబ్స్టేషన్లు, సూర్య ఘర్ అతి ముఖ్యమైన వని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రజలకు నాణ్యమైన సౌకర్యాలను అందుబాటుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వారు తెలిపారు. అన్ని రంగాలలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించి సమర్థవంతమైన అమలకు కీలక ఆదేశాలను జారీ చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా విద్యుత్, వైద్యం విషయంలో అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తప్పవని కూడా వారు తెలిపారు. ఇప్పటికే మంజూరైన నిధులతో రోడ్ల నిర్మాణాలు నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని పాత రోడ్లను అవసరమైన చోట్ల మరమ్మత్తులు చేయాలని ప్రజా రవాణాకు ఎలాంటి ఆటంకములు ఉండరాదని వారు అధికారులను ఆదేశించారు. ఇక ఏరియా ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు మందుల లభ్యత సిబ్బంది పనితీరు వంటి అంశాలను వారు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి ద్వారా ఆరాదిశారు. ప్రభుత్వ విధానాలను ప్రజలకు చేరువ చేస్తూ వ్యవస్థలు వేగంగా పనిచేసేలా కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ సంపత్ కుమార్, వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలకు వైద్య భరోసా… మంత్రి సత్య కుమార్ యాదవ్.
సీఎంఆర్ ద్వారా పేద ప్రజలకు వైద్య భరోసా ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కార్యాలయంలో మంత్రి చేతుల మీదుగా చెక్కులను అందజేశారు. ఇందులో తొమ్మిదిమంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,43,618 విలువ గల చెక్కులను వారు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య సంబంధిత అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ కార్యక్రమము యొక్క ముఖ్యము అని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆరోగ్య సేవా పథకాలను చేపట్టి రాష్ట్ర ప్రజల జీవితాల్లో పాజిటివ్ మార్పులు తీసుకొస్తోందని తెలిపారు. సమాజంలో నిస్సహాయులైన వారికి అండగా నిలబడడమే సుస్థిర పాలన అందించడమే మా లక్ష్యము అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షులు గొట్లూరు చంద్ర, చెన్నకేశవ స్వామి ఆలయ అడహక్క చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్ ప్రసాద్, బిజెపి నాయకులు డోలా రాజారెడ్డి, గిర్రాజు నగేష్, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు