శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి
విశాలాంధ్ర ధర్మవరం;; పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయము అని శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ, కార్యదర్శి రామలింగయ్య, ఉపాధ్యక్షులు టిసి. నారాయణరెడ్డి, కోశాధికారి జె. సూర్యనారాయణ, సభ్యులు సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని సత్య సాయి నగర్, పుట్టపర్తి రోడ్ శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం లో ఈనెల 11వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్ష మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరమును శ్రీ షిరిడి సాయిబాబా సేవాసమితి వారు, జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా, పుష్పగిరి కంటి ఆసుపత్రి, కడప వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వారి తెలిపారు. కంటి ఆపరేషన్లు పరీక్షలు పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆపరేషన్కు ఎంపికైన వారికి ఉచిత రవాణా, ఉచిత వసతి, ఉచిత కంటి ఆపరేషన్, నిర్వహించబడునని తెలిపారు. ఈ ఆపరేషన్లు పుష్పగిరి కంటి ఆసుపత్రి, కడప నందు మాత్రమే చేయడం జరుగుతుందన్నారు. కంటి నిపుణుల సలహాలతో కంటికి ఉచితంగా లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కంటి పరీక్షలకు ఆపరేషన్ శిబిరములకు వచ్చి వారు ఒరిజినల్ ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు తమ వెంట తీసుకొని రావాలని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
పేదలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా ధ్యేయం..
RELATED ARTICLES