Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపచ్చదనం పరిరక్షణలో భాగస్వామ్యమవ్వండి

పచ్చదనం పరిరక్షణలో భాగస్వామ్యమవ్వండి

– మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పిలుపు.

ధర్మవరంలో మొక్కల నాటింపు కార్యక్రమం ఘనంగా నిర్వహణ

విశాలాంధ్ర ధర్మవరం; ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి , ధర్మవరం శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ పిలుపుమేరకు, ధర్మవరం పట్టణంలో మొక్కల నాటింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, మంత్రి నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు పాల్గొన్నారు. వారు కలిసి పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా హరీష్ బాబు గారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారి పిలుపుమేరకు అమ్మ పేరుతో ఓ మొక్క అనే కార్యక్రమం దేశవ్యాప్తంగా నిర్వహించబడుతోంది అని తెలిపారు. దీనిలో భాగంగా జూన్ 5 నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పేరుతో కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలి అని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు అని, ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన జీవన వాతావరణం అందించాలంటే, ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక్క మొక్కను నాటి, దానిని పెంచడం ద్వారా ధర్మవరం పట్టణాన్ని పచ్చదనంతో నింపాలనే సంకల్పంతో ముందుకెళ్లాలన్నారు.అదేవిధంగా మొక్కలు నాటే ఈ ఉద్యమం ద్వారా ప్రజల్లో పచ్చదనంపై అవగాహన పెంచుతూ, పర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యత గల సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కార్యాలయ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, శాంసన్, కేశవ, వీరేష్, మున్సిపల్ మహిళా అధికారులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు అంబటి సతీష్, ధర్మవరం పట్టణ అధ్యక్షులు చంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేష్, బిజెపి మహిళా నాయకురాలు రాధమ్మ, మహాలక్ష్మి, మైనార్టీ నాయకులు నబి రసూల్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు