డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ పద్మావతి సీఐడీ విచారణకు హాజరుకావాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7, 8 తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ… డాక్టర్ ప్రభావతి విచారణకు ఎలా సహకరించడం లేదో సాక్షాలతో సహా కోర్టు ముందు ఉంచారు. ఈ క్రమంలో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ కె.విశ్వనాథమ్ ల ధర్మాసనం పద్మావతికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఆర్ఆర్ కస్టోడియల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను పద్మావతి దాఖలు చేశారు. అయితే ఆమె విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆమెకు సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ… విచారణకు హాజరుకావాలని సూచించింది. అయితే ఆమె విచారణకు హాజరుకావడం లేదని… ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించింది. విచారణకు హాజరుకాకపోతే మధ్యంతర రక్షణను తొలగిస్తామని హెచ్చరించింది.
రఘరామ టార్చర్ కేసు … సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
RELATED ARTICLES