విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా ): శ్రీకాకుళం జిల్లా పొందూరు లో సోమవారం నాడు జరిగిన జిల్లా స్థాయి పురుషుల బెంచ్ ప్రెస్ బాడీ బిల్డింగ్ లో రాజాం క్రీడాకారులు పథకాలు సాధించి సత్తా చాటరు. డేవిడ్ 74 కేజీల విభాగంలో 1వ స్థానం, 66 కేజీల విభాగంలో రౌతు మని 3వ స్థానం సాధించారు. క్రీడాకారులు కు రామాఆంజనేయ పవర్ జిమ్ కోచ్ చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. బాడీబిల్డింగ్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయ పడుతుందని కోచ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.