కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ జరగనుంది.
పోలీసుల విచారణకు హాజరైన రాంగోపాల్ వర్మ
RELATED ARTICLES