: జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విశాఖపట్నం నుంచి వర్చువల్ విధానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 9 న జేఎన్టీయూలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ను ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జేఎన్టీయూ అడ్మిన్ బిల్డింగ్ ని సర్వం సిద్ధం చేయాలన్నారు. ప్రారంభోత్సవానికి ఐదు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అడ్మిన్ బిల్డింగ్ లో ఆర్.అండ్.బి నుంచి ఇంచార్జ్ అధికారులను నియమించి అన్ని పనులను పూర్తి చేయాలన్నారు. అడ్మిన్ బిల్డింగ్ లో క్లీనింగ్, పెయింటింగ్, ఎలక్ట్రిసిటీ పనులు, అవసరం మేరకు ఫర్నిచర్ ఏర్పాటు చేయడం వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్.అండ్.బి ఎస్ఈ వి.రాజగోపాల్, జేఎన్టీయూ సిబ్బంది భానుమూర్తి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.