Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి2వ రోజు కొనసాగిన రిలే దీక్షలు..

2వ రోజు కొనసాగిన రిలే దీక్షలు..

ఏఐటీయూసీ నాయకులు
విశాలాంధ్ర -ధర్మవరం;; సర్వేనెంబర్ 650 – 2 న్యాయం జరిగేంత వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు రెండవ రోజు వరకు కొనసాగాయి. ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు ఎర్రం శెట్టి రమణ, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో 650-2, సర్వే నెంబర్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టాలని ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్స్ కార్మికులు ఉద్యమాలు చేస్తున్నారు. కానీ వారి సమస్యలు రెవిన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు అని మండిపడ్డారు. కార్మికులను మాత్రం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని తెలిపారు.. మరి ఇప్పటికైనా ఆర్టీవో వెంటనే స్పందించి 650-2 సర్వే నెంబర్ లో ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని వెంటనే తొలగించి, వారి దొంగ పట్టాలను రద్దుచేసి, అర్హులైన ప్లంబర్స్ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షం లో కార్మికుల కోసం వారు చేసే ఉద్యమాలలో అన్ని విధాల అండగా ఉంటామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, ఏఐటీయూసీ కార్మిక సంఘం నాయకులు ఎర్రం శెట్టి రమణ, ప్లంబర్స్ అండ్ ఎలక్ట్రిషన్ కార్మిక సంఘం అధ్యక్షులు, గోవిందరాజులు, కార్యదర్శి అన్నం లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణ, తాజుద్దీన్, రామసుబ్బయ్య, రామకృష్ణ,సురేంద్ర, మసూద్, చిన్న, నాగేంద్ర, శ్రీనివాసులు,మహిళా సమాఖ్య నాయకులు లలితమ్మ,లింగమ్మ,ఈరమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు