విశాలాంధ్ర ధర్మవరం; ఎం టి ఎస్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ( ఏపీ యుఎస్) ఉపాధ్యాయుల సంఘం నాయకులు పట్టణములోని ఎన్డీఏ కార్యాలయంలో ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏపీ యుఎస్ జిల్లా గౌరవ సలహాదారుడు అన్నం అరవిందు మాట్లాడుతూ ఎంటిఎస్ ఉపాధ్యాయులు బదిలీలు ఆపాలని పాత స్థలాలలోనే విధులు చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఎటువంటి సర్వీస్ బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని మాకు కూడా కేటాయించాలని వారు తెలిపారు. అదేవిధంగా మాకు సర్వీస్ నిబంధనలు సర్వీస్ రిజిస్టర్ ఓపెన్ చేయాలని, ఎం టి ఎస్ ఉపాధ్యాయులకు మున్సిపాలిటీ ఖాళీలు ఇప్పుడు పనిచేయుచున్న మండలాలకు దగ్గరగా విధులు కేటాయించాలని తెలిపారు. అదేవిధంగా ఎంటిఏ ఉపాధ్యాయులకు స్పావ్స్ కు అవకాశం ఇవ్వాలని తెలిపారు. అనంతరం మంత్రి వారి సమస్యలు విన్న తర్వాత తమ సమస్యను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేలా కృషి చేస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ యుఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎం టి ఎస్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించండి.. ఏపీ యుఎస్ సంఘం
RELATED ARTICLES