Tuesday, June 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీ పదవి స్వీకరణ

రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీ పదవి స్వీకరణ

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాంస్కృతిక మండలి లో 2025 -26 సంవత్సరమునకు గాను నూతన రోటరీ క్లబ్ కమిటీ, నూతన ఇన్నర్ వీల్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ బి జి ఈ. కేశవరెడ్డి, పిడికి చిన్నపరెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ సుమంత్ నంబూరి పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథులు నూతన రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ క్లబ్ వారిచే ప్రతిజ్ఞతో పాటు పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఇందులో భాగంగా రోటరీ క్లబ్ అధ్యక్షులుగా డి. నాగభూషణ, కార్యదర్శిగా పి. విజయ భాస్కర్, కోశాధికారిగా కె నరేందర్ రెడ్డి ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా ఇన్నర్ వీల్ క్లబ్ నూతన కమిటీలో చైర్మన్ సుమిత్ర రాజేష్ ముఖ్య అతిథులుగా విచ్చేసి నూతన కమిటీ వారిచే బాధ్యతలను స్వీకరింపజేశారు. ఇందులో అధ్యక్షులుగా డాక్టర్. జూకూరు సుమలత. కార్యదర్శిగా ఏ. లక్ష్మి, కోశాధికారిగా కె.రాజేశ్వరి, ఐ ఎస్ ఓ గా అంబటి అరుణశ్రీ, ఈ ఎస్ ఓ గా కె. పద్మ , ఆర్గనైజింగ్ ఆఫీసర్గా గట్టు నాగరత్న నూతన కమిటీకి ఎంపిక కావడం జరిగింది. ఈ ఇన్నర్ వీల్ కమిటీకి ముఖ్య అతిథులుగా సుమిత్ర రాజేష్ అధ్యక్షతన జరిగింది. అనంతరం నూతన కమిటీ వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఇన్నర్ వీల్ క్లబ్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని, వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టి మరింత ముందుకు వెళతా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయసింహ, రత్నశేఖర్ రెడ్డి, సోలిగాల్లా వెంకటేశులు, సత్రశాల ప్రసన్నకుమార్ ,అంబటి సతీష్, పెద్దిరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, రమేష్ బాబు, శివయ్య, బివిచలం,గట్టు హరినాథ్, పెద్దారెడ్డి, నాగరత్న, భాగ్యలక్ష్మి ,పద్మావతి, సంకారపు జయశ్రీ, సరస్వతమ్మ ,జగ్గా కళావతి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు