విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయుటలోని సంతృప్తి తో పాటు సంతోషం కూడా ఉంటుంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు మొత్తం 360 మందికి భోజనపు ప్యాకెట్లను,వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లను కూడా పంపిణీ చేశారు. ఈ పప్పీ కార్యక్రమం ఆసుపత్రిలోని వైద్యులు ,సిస్టర్ల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం నామా ప్రసాద్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను ఆసక్తిగల దాతలు సెల్ నెంబర్ 9966047044కు గాని 9030445065 గాని సంప్రదించాలని తెలిపారు. నాటి ఈ కార్యక్రమానికి సేవాదాతగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ, వెంకటస్వామి వారు వ్యవహరించడం పట్ల శ్రీ సత్యసాయి సేవాసమితి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలని తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు నిర్వహిస్తున్న ఇటువంటి సేవలు పేదల పాలిట వరంగా మారాయని, వివిధ కారణాల వలన గ్రామాల నుంచి, పట్టణాల నుంచి పేదలకు రావడం, వైద్య చికిత్సలతో పాటు భోజన పంపిణీ చేయడం పట్ల రోగులు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తరుపున శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
.
రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి, సంతోషం
RELATED ARTICLES