భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ ఉన్నారు. బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో 24 మంది మృతి చెందారు. కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో 22 మంది, అల్లూరు సీతారామారాజు జిల్లా వైరామవరం మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మృతి చెందారు. కర్రెగుట్టల్లో తలదాచుకున్న మావోయిస్టులపై భద్రతా దళాలు విరుచుకుపడుతున్నాయి. కర్రెగుట్టల్లో ఆపరేషన్ ప్రారంభమై 17వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు ఎన్కౌంటర్లలో 34 మంది మావోయిస్టులు మృతి చెందారు. అలాగే మావోయిస్టులు అమర్చిన మందుపాతరలకు ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అలాగే ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. అల్లూరి జిల్లా అరకులోయ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు నక్సల్స్ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు అగ్రనేతలు జగన్ అలియాస్ పండన్న, రమేష్ అలియాస్ నాగన్న ఉన్నారు. జీకేవీధి ఏజెన్నీలో కూంబింగ్ కొనసాగుతోంది.
రూ.25 లక్షల రివార్డు..
ఈ మేరకు జీకే వీధి ఏజెన్సీలో మావోయిస్టులున్నారనే పక్కా సమాచారంతో కూంబింగ్ చేపట్టారు పోలీసులు. దీంతో ఇద్దరి మధ్య కాల్పులు చోటుచేసుకోగా నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో మావోయిస్టు కీలక నేత జగన్ అలియాస్ పండన్న చనిపోయారు. జగన్పై రూ.20 లక్షల రివార్డ్ ఉంది. ఇక మరో ఇద్దరు మావోయిస్టులు సంకు నాచికా, రమేష్ మృతి సైతం మృతిచెందగా అతనిపై రూ. 5 లక్ష రివార్డ్ ఉంది. ఇక నాగన్న మల గెట్ట గ్రామం, కలిమెలా బ్లాక్, మల్కన్ గిరి జిల్లా ఒడిస్సా రాష్ట్రం డిసిఎం గా విధులు నిర్వహిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొమ్ములవాడ గ్రామానికి చెందిన.. కాకూరి పండన్న ఏవోబి స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.