Tuesday, May 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయితెలుగు, ఆంగ్లం పై తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ అవసరం..

తెలుగు, ఆంగ్లం పై తప్పనిసరిగా ప్రత్యేక శ్రద్ధ అవసరం..

గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి.
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా తెలుగు ఆంగ్లంపై తప్పనిసరిగా పట్టు ఉండాలని, రాయిటలో చదువుటలో ప్రత్యేక శ్రద్ధ ఎంతైనా అవసరము అని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలియజేశారు. ఈ సందర్భంగా అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు తెలుగు, ఆంగ్లం విషయంలో మంచి మెలకువలను తెలుసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా నీతి కథలు కూడా తెలుసుకోవాలని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాల మేరకు యోగా ఆసనాలు కూడా నేర్పించడం జరిగిందని యోగా వల్ల చక్కటి ఆరోగ్యము, శరీర దృఢత్వం కలుగుతుందని తెలిపారు.ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు