జిల్లా గోరక్ష ప్రముఖు నరసింహారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలో గోవదలను అడ్డుకొని, గోవధ నిషేధ చట్టంను పక్కాగా అమలు చేయాలని కోరుతూ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ చౌదరి జిల్లా కార్యదర్శి నరేంద్ర కుమార్ జిల్లా గోరక్ష ప్రముఖ నరసింహారెడ్డి జిల్లా ఎస్పీ రత్నాకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గోవదలు అధికమయ్యాయని, గోవా నిషేధ చట్టం తూతూ మంత్రంగా నడుస్తోందని, దీనివల్ల పశువులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని తెలిపారు. అదేవిధంగా బక్రీద్ సందర్భంగా గోవదలను అడ్డుకోవాలని, గోవా నిషేధ చట్టమును అమలు చేసే విధంగా చర్యలు గైకొనాలని వారు తెలిపారు. ఇప్పటికే పలు మండలాలలో ఆవులు, ఎద్దులు, చిన్న పెద్ద అని తేడా లేకుండా వాటిని చంపి మాంసరూపమైన ఇతరులకు అమ్మడం జరుగుతుందని తెలిపారు. కావున ఇప్పటికైనా గోవులను సంరక్షించే దిశగా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెంగముని, కోశాధికారి ప్రకాష్ రావు, విభాగ బజరంగ్దళ్ సంయోజక్ నవీన్ కుమార్, మురళీమోహన్ రెడ్డి, పుట్టపర్తి ప్రకండ అధ్యక్షులు వెంకటరమణ, కార్యదర్శి ఆక్కుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోవధలను అడ్డుకొని, గోవద నిషేధ చట్టంలో అమలు చేయండి..
RELATED ARTICLES