పేదల సమస్యలను పరిష్కరించుటలో ప్రభుత్వ వైఫల్యం
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి పెద్దయ్య
విశాలాంధ్ర- శింగనమల (పుట్లూరు) : పుట్లూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ ( బి కే ఎం యు) ఆధ్వర్యంలో రాష్ట్ర సమితిపిలుపు మేరకు వెలుగు ఆఫీస్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ ధర్నా నిర్వహించారు.
ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి పెద్దయ్య మాట్లాడుతూ!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సమస్యలను పూర్తిగా పక్కన పెట్టిందని,అధికారం లోకి రాకముందుఎన్నికల్లో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, సంవత్సర కాలం పూర్తయిన ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదన్నారు.
వ్యవసాయ కార్మికులు దేశ వ్యవసాయానికి అభివృద్ధికి వెన్నె ముకని, దేశ ఆర్థిక అభివృద్ధికి వారి గొప్ప సహకారం ఉన్నప్పటికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ పేదల అభ్యున్నతి కుంటుపడిందన్నారు. తక్షణమే ఈ క్రింది సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనిని ఒక్కో కుటుంబానికి 200 రోజుల పని కల్పించి రోజువారి వేతనం 700 రూపాయలుచట్ట ప్రకారం నిర్ధారించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పెండింగ్లో ఉన్న బకాయిలు వడ్డీతో తక్షణం చెల్లించాలని,
వ్యవసాయ కార్మికులకు 55 సంవత్సరాల వయసులో వారికి నెలకు 10,000వేల రూపాయలు వృద్దాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలోఓబుళపతి, పెద్దన్న, బాలు, వెంకటశివ, డి,నారాయణ, నడిపినారాయణ,లక్ష్మి నారాయణ, రాంబాబు,దేవరాజు, ఎం,నారాయణ,తదితరులు పాల్గొన్నారు.