విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని చింతలపల్లి పశువైద్య కేంద్రం నందు 80 బ్యాగ్స్ (50 కేజీలు) 80 మంది పాడి రైతులకు సబ్సిడీ ద్వారా అందజేయడం జరిగిందని మండల పశు వైద్య అధికారి డాక్టర్ శేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 50కేజీ బ్యాగ్ 1100 రూపాయలు కాగా 50 శాతము సబ్సిడీ పోను 555 రూపాయలు రైతు వాటాగా తీసుకొని పాడిరైతులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రైతులందరూ ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశువుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను పాటించాలని, వైద్యుల సలహాలు తప్పక పాటించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల కన్వీనర్ మహేష్ చౌదరి ,విజయ్ సారధి , గ్రామ రైతులు, పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
50 శాతము రాయితీ పై పశుదాణ సరఫరా.. మండల పశువైద్య అధికారి డాక్టర్ శేఖర్
RELATED ARTICLES