టిడిపి నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎల్.సి.కె పురంలో మున్సిపల్ రిజర్వ్ స్థలంలో నిర్మించిన కమర్షియల్ కాంప్లెక్స్ లను వెంటనే మున్సిపాలిటీ వారు స్వాధీన పరుచుకోవాలి అని టిడిపి నాయకులు టిడిపి పట్టణ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు పరిసే సుధాకర్, పురుషోత్తం గౌడ్ 25 వ వార్డు ఇంచార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు తదితరులు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ
గత వైసిపి ప్రభుత్వ హయాంలో మున్సిపల్ రిజర్వ్ స్థలాలను, రెవెన్యూ రిజర్వు స్థలాలను పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడి, కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టుకున్నారని తక్షణమే వాటిని స్వాధీనం పరుచుకోవాలని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ గారి సూచనల మేరకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి ధర్మవరం పట్టణంలో గత వైసిపి ప్రభుత్వం హయాంలో కబ్జాలకు గురైన స్థలాలను వాటి సర్వే నెంబర్లతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ధర్మవరం పట్టణం 626 సర్వేనెంబర్ ఎల్ సి కె పురంలో కబ్జాకు గురై కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించిన మున్సిపల్ రిజర్వు స్థలాన్ని వెంటనే స్వాధీన పరుచుకోవాలని తెలిపారు. అదేవిధంగా పై సర్వే నెంబర్లు గల మున్సిపల్ రిజర్వ్ స్థలాన్ని కబ్జా చేసినట్లు హైకోర్టు కి కూడా వెళ్లడం జరిగిందని, హైకోర్టులో కూడా అనుకూలంగా తీర్పు రావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, అదేవిధంగా మున్సిపల్ శాఖ మాత్యులు పొంగూరు నారాయణ కూడా వినతిపత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు. వాటిపై విచారణ జరిపి తక్షణమే సంబంధిత మున్సిపల్ రిజర్వ్ స్థలాన్ని స్వాధీనపరుచుకోవాలని సీఎంఓ నుండి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు రావడం జరిగిందని తెలిపారు. వాటిపై ధర్మవరం రెవిన్యూ డివిజనల్ అధికారి విచారణ జరిపి తగు నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగిందని తెలిపారు. వాటిపై విచారణ జరిపిన అప్పటి రెవెన్యూ డివిజనల్ అధికారి అయినటువంటి వెంకట శివారెడ్డి గారు తక్షణమే మున్సిపల్ రిజర్వ్ స్థలాన్ని స్వాధీనపరుచుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెదేపా నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది అన్నారు. పైవాటిని అన్నింటిని పరిశీలించిన కమిషనర్ వెంటనే సంబంధిత అధికారులను పిలిపించి తక్షణమే విచారణ జరిపి మున్సిపల్ రిజర్వ్ స్థలాన్ని స్వాధీనపరుచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అని తెలిపా రు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోసాల శ్రీరాములు, కేతినేని రాజా, వల్లపు రవీంద్ర, పల్లపు శివశంకర్, అంకన్న, రామకృష్ణ, తొగట అనిల్, నాగేంద్ర, చిలిమి సూరి, క్లస్టర్ రామాంజి తదితరులు పాల్గొన్నారు.
అన్యాక్రాంతమైన మున్సిపల్ రిజర్వ్ స్థలాలను స్వాధీన పరుచుకోండి..
RELATED ARTICLES