Monday, June 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆర్డిటి సేవలను పునరుద్దించేలా చర్యలు చేపట్టండి..

ఆర్డిటి సేవలను పునరుద్దించేలా చర్యలు చేపట్టండి..

ఆరోగ్యశాఖ మంత్రి కి వినతించిన శ్రీ సాయి రూరల్ వికలాంగుల మండల సమైక్య లీడర్లు
విశాలాంధ్ర ధర్మవరం;; బత్తలపల్లి లో గల ఆర్డిటి సంస్థ సేవలను తిరిగి పునరుద్దించేలా చర్యలు చేపట్టి ఆ సంస్థ భద్రతకు కృషి చేయాలని కోరుతూ శ్రీ సాయి రూరల్ వికలాంగుల మండల సమైక్య నాయకులు ఆక్టివ్ లీడర్స్ ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలోని మంత్రి సత్య కుమార్ యాదవ్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్డిటి సేవలు నిలుపుదల చేయడం, ఎఫ్ సి ఆర్ ఏ రెన్యూవల్ చేయాలని, లేకపోతే వికలాంగులు, వారి కుటుంబ సభ్యులు, బడుగు బలహీన వర్గాల వారు ఎన్నో ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా విద్య, వైద్య, క్రీడా తదుపరి సదుపాయాలను కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తప్పకుండా ఆర్డిటి సంస్థ సేవలను కొనసాగేలా చూస్తానని, ఎఫ్ సి ఆర్ ఏ రెన్యువల్ను తప్పకుండా చేయడానికి కేంద్ర మంత్రులతో మాట్లాడి అమలు అయ్యేలా చేస్తానని వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి రూరల్ వికలాంగుల మండల సమైక్య నాయకులు, యాక్టివ్ లీడర్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు