Monday, February 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఅంత్య క్రియలకు తారక్ చరిత్ర ట్రస్ట్ చేయూత..

అంత్య క్రియలకు తారక్ చరిత్ర ట్రస్ట్ చేయూత..

అధ్యక్షులు రామాంజనేయులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని 29వ వార్డు డిఎల్ఆర్ కాలనీకి చెందిన పుల్ల నాగరత్నమ్మ (65) ఆకస్మికంగా మృతి చెందింది. మృతురాలికి భర్త తప్ప ఎవ్వరు కూడా ఆసరాగాలేరు. గతంలో ఉన్న ఒక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అంత్యక్రియలు జరపడానికి ఇబ్బంది పడుతున్న విషయాన్ని తారక్ చేయుట ట్రస్ట్ వారికి తెలియజేశారు. దీంతో తయారుచేయుట ట్రస్ట్ వారు ప్రముఖ పట్టణ దాత సందా రాఘవ కు విషయాన్ని తెలియజేయడంతో, వారు దాతృత్వంతో ఎనిమిది వేల రూపాయలను భర్త పుల్ల నాగభూషణకు తారక్ చేయుట టెస్ట్ ద్వారా అందించడం జరిగిందని తెలిపారు. సమయానికి అంత్యక్రియలకు సహాయం అందించిన సందా రాఘవకు, తారక్ చరిత్ర ట్రస్ట్ కు భర్త కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు