Friday, June 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎన్డీఏ ప్రభుత్వ ఏడాది పాలనపై తెదేపా నాయకులు విజయోత్సవ సంబరాలు

ఎన్డీఏ ప్రభుత్వ ఏడాది పాలనపై తెదేపా నాయకులు విజయోత్సవ సంబరాలు

సుపరిపాలన-స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం

ఎన్డీఏ ప్రభుత్వ ఏడాది పాలనలో ఎన్నో సంక్షేమ-అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం
విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణం గాంధీనగర్లో గల తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో తెలుగుదేశంపార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెదేపా నాయకులు మాట్లాడుతూ,రాష్ట్రంలో సైకో పాలన ముగిసి నేటికి ఏడాది పూర్తి అయినందున, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన-స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్రం ముందుకు వెళుతోందని అదేవిధంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తూ.చ తప్పకుండా పెన్షన్ల పెంపు,అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ,ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ నేడు తల్లికి వందనం, ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో దాదాపు 90 శాతం సూపర్ సిక్స్ హామీలు అన్నింటిని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. రాబోవు నాలుగేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతుందని కేంద్రంలో మోడీ సహకారం, రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల జోడీలతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెదేపా నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు