జమ్మూ కశ్మీర్ అధికారులు అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు
అన్ని జైళ్లలోనూ భద్రతను పెంచిన ప్రభుత్వం
హై ప్రొఫైల్ ఉన్న జైళ్లకు ఎక్కువ బెడద
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఉగ్రదాడిపై దర్యాప్తు ముమ్మరం చేసిన నిఘా వర్గాలు తాజాగా ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడవచ్చని హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈసారి భద్రతా దళాలు, పర్యాటకులు, సామాన్య ప్రజల టార్గెట్గా కాకుండా.. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు టార్గెట్గా దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశారు.జమ్మూకాశ్మీర్లోని పలహ్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారత దేశాన్ని కలిచి వేసింది. పచ్చని ప్రకృతిని ఆస్వాధించేందుకు వెళ్లిన సుమారు 28 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. మతాన్ని అడిగి మరీ ఒక్కొక్కరి దారుణంగా కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. భారత్-పాకిస్తాన్ సరిహద్దులో నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు జరుపుతున్న కాల్పులను భారత్ సైన్యం సమర్థవంతంగా తిప్పి కొడుతోంది. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తును ముమ్మరం చేసిన నిఘా వర్గాలు కీలక విషయాలను రాబడుతున్నారు. తాజాగా ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈసారి భద్రతా దళాలు, పర్యాటకులు, సామాన్య ప్రజల టార్గెట్గా కాకుండా.. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులు టార్గెట్గా దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీనగర్ సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు వంటి జైళ్లపై ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జైళ్ల భద్రతను మరింత పటిష్ఠం చేసింది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ . ప్రస్తుతం జమ్ముకశ్మీర్ జైళ్లలో హై-ప్రొఫైల్ ఉగ్రవాదులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్లు , ఉగ్ర సంస్థల స్లీపర్ సెల్ సభ్యులు ఉన్నారు. ఓవర్ గ్రౌండ్ వర్కర్లు ఉగ్రవాదులకు లాజిస్టికల్ సహాయం, ఆశ్రయం, రవాణాకి సాయం చేస్తూ వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వారి ద్వారా తమ సమాచారం బయటకు వస్తుందన్న కోణంలో ఉగ్రవాదులు జైళ్లను టార్గెట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి.