పి ఎస్ యు, వైయస్సార్ ఎస్ యు, ఏఐఎస్బి విద్యార్థి సంఘం నాయకులు
ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల విక్రయిస్తున్న పాఠశాలను సీజ్ చేయాలి
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నటువంటి పాఠశాలల పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలి అని ధర్మవరం మండల విద్యాశాఖ అధికారి రాజేశ్వరి కు వివిధ విద్యార్థి సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ప్రైవేట్ పాఠశాల వారు అక్రమ అడ్మిషన్లు చేపడుతున్నారని, పాఠశాల ప్రారంభం కాకమునుపే మా యొక్క పాఠశాలలో అడ్మిషన్ చేసుకోవాలి అని, విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు అని మండిపడ్డారు. అదేవిధంగా మరోవైపు ధర్మవరం పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాల వారు హాస్టల్ పర్మిషన్ లేకపోయినా నడుపుతున్నారు అని, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో నే పాఠ్యపుస్తకాలు యూనిఫామ్, షూ, టై, బెల్ట్ లాంటివి మా యొక్క పాఠశాలలోనే కొనుగోలు చేసుకోవాలని విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను ప్రవేట్ పాఠశాల వారు డిమాండ్ చేయడం దారుణం కాదా? అని వారు ప్రశ్నించారు. పుస్తకాల ఒక్కొక్క సెట్టు 6000 నుంచి 7000 రూపాయల వరకు పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారు అని,అదే విధంగా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాల వారు కూడా ప్లీజ్ స్ట్రక్చర్ నోటీసు బోర్డులో అతికించకుండా వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు అని తెలిపారు.ప్రైవేట్ పాఠశాల పై తక్షణమే ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భవిష్యత్తులో పాఠశాలలు ఎదుట, ప్రభుత్వ కార్యాలయాలు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర, వైయస్సార్ఎస్ యు జిల్లా అధ్యక్షులు పురుషోత్తం, ఏఐఎస్బి జిల్లా కార్యదర్శి పోతలయ్య, వైయస్సార్ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.