విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలో ఎంతో సంతృప్తి, సంతోషం ఉందని శ్రీ సత్యసాయి సేవా సమితి గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 370 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను డాక్టర్లు, నర్సుల చేతుల మీదుగా అందజేశారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను కూడా పంపిణీ చేశారు. అనంతరం కన్వీనర్ నామా ప్రసాద్ మాట్లాడుతూ నేటి ఈ సేవా కార్యక్రమానికి సేవాదాతగా దొడ్డి హనుమక్క జయరామిరెడ్డి వారి కుటుంబ సభ్యులు నిర్వహించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.దాతల సహాయ సహకారములతోనే ఇటువంటి సేవా కార్యక్రమాలను పుట్టపర్తి బాబా ఆశీస్సులతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి చేస్తున్న సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని, దీనివల్ల మానవతా విలువలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దానిలో కొంతైనా ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, రోగులు తరఫున సత్యసాయి సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.
రోగులకు సేవ చేయుటలోనే ఎంతో సంతృప్తి ఉంది.. కన్వీనర్ నామా ప్రసాద్
RELATED ARTICLES