మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణానికి తాగునీటి సరఫరా చేసే పైపులైన్లు లీకేజ్ ఉన్నందున, వార్నపల్లి నుండి ధర్మవరం వరకు పలుచోట్ల లీకేజీలు ఏర్పడి నీరు వృధాగా పోతున్నందున ఈనెల 6వ, 7వ తేదీలలో నీటి సరఫరాలు నిలిపి వేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పైపులైన్లు మరమ్మత్తుల పనులు పూర్తి చేసి తిరిగి ఎనిమిదవ తేదీ నుంచి నీటి సరఫరా పంపిణీ చేయబడుతుందని వారు తెలిపారు. నీకు కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. కావున ప్రజలు సహకరించవలసినదిగా వారు తెలిపారు.
లీకేజీలు ఉన్నందున రెండు రోజులు పాటు నీటి సరఫరా ఉండదు..
RELATED ARTICLES