విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఆరవ రోజు చిత్రలేఖనము నాట్యములపై శిక్షణ ఇవ్వడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ టీచర్, డాన్స్ టీచర్లచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అనంతరం అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ చదువుతోపాటు చిత్రలేఖనం నాట్యం జీవితంలో ఒక మంచి భవిష్యత్తుగా గుర్తింపుగా మిగిలిపోతుందని తెలిపారు. ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 48 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.
ధర్మవరంలోని గ్రంథాలయంలో చిత్రలేఖనము, నాట్యముపై శిక్షణ..
RELATED ARTICLES