Friday, June 6, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయినీతి కథలు, తెలుగు పద్యాల పై శిక్షణ..

నీతి కథలు, తెలుగు పద్యాల పై శిక్షణ..

గ్రంథాలయ అధికారి. అంజలి సౌభాగ్యవతి

విశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయాలు వలన నైపుణ్యం పెంపొందించుకోవచ్చుఅని, గ్రంధాలయాలు నిరుద్యోగులకు, అదేవిధంగా విద్యార్థులకు నైపుణ్యమును పెంచేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు.ఈ సందర్భంగాపట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో ఉచిత శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నీతి కథలు, తెలుగు తెలుగు పద్యాల పై శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వివిధ పోటీ పరీక్షలకు చిన్నతనం నుండే అభ్యసించాలని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన విద్య భవిష్యత్తుకు బంగారు బాట అవుతుందని తెలిపారు. తదుపరి యోగ వ్యాయామం కూడా చేయించడం జరిగిందన్నారు.
ఈ శిబిరం జూన్ 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో చదువు, పోటీ పరీక్షలు, వివిధ విభాగాలకు చెందిన అంశాలకు గల పుస్తకాలు కూడా ఉచితంగా లభిస్తాయి అంతేకాకుండా మా గ్రంథాలయంలో ఉచిత సభ్యత్వములు కూడా నిర్వహిస్తున్నామని కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినచో, రుసుమును దాతల ద్వారా సేకరించడం జరుగుతుందని ఇటువంటి అవకాశాన్ని కూడా పాఠకులు, నిరుద్యోగులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో 25 మంది విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది రమణ నాయక్, సత్యనారాయణ, శివమ్మ, గంగాధర్, పాఠకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు