మురళి నాయక్ వీర జవాన్ కి ఘన నివాళులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల కాశ్మీర్లోని భారతీయులపై పాకిస్తాన్ దాడుల్లో పదుల సంఖ్యలో మృతి చెందడం చాలా బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కౌన్సిలర్లు గజ్జల శివ, పెనుజూరు నాగరాజు, జిలాన్ భాష తదితరులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటువంటి ఉగ్రవాద దాడులు మరోసారి భారతదేశ పై జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలని వారు ప్రధానమంత్రిని కోరారు. అంతేకాకుండా భారతదేశ వీర జవాన్లు కూడా పాకిస్తానికి తమదైన శైలిలో ఎదురుదెబ్బ తీస్తారని కూడా వారు స్పష్టం చేశారు. వీర సైనికులు దేశ సేవ కోసం తమ ప్రాణాలను త్యాగం చేస్తున్నారని, అలాంటి వీరులను మనం ఎవ్వరు కూడా మరవకుండా స్మరించుకోవాలని వారు తెలిపారు.
పాకిస్తాన్ దాడుల్లో కాశ్మీర్లో మృతి చెందిన వారికి నివాళులు
RELATED ARTICLES