అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అనేక దేశాలపై సుంకాలు విధిస్తూ.. భయపెడుతున్నారు. ఇప్పటికే కెనడా, మెక్సికో వంటి దేశాలపై సుంకాలు విధించి మార్చి 4వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన ట్రంప్.. తాజాగా భారత్, చైనాలపై కూడా సుంకాలు విధిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా వాటిని ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమల్లోకి తీసుకు వస్తామన్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి మంగళవారం రోజు ట్రంప్ కాంగ్రెస్ సంయుక్త సెషన్లో ప్రసగించారు. ఈక్రమంలోనే తాను చేసిన అభివృద్ధి గురించి వివరిస్తూ.. భవిష్యత్తులో తీసుకోబోయే కీలక నిర్ణయాల గురించి వెల్లడించారు. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఆయా దేశాలు తమపై ఏ స్థాయిలో సుంకాలు విధిస్తున్నాయో కూడా వివరంగా చెప్పుకొచ్చారు. పలు దేశాలు దశాబ్దాల పాటు తమ దేశంపై సుంకాలు విధిస్తున్నాయని.. యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, ఇండియాలు ప్రముఖంగా అమెరికా నుంచి అత్యధిక సుంకాలు వసూలు చేస్తున్నట్లు ట్రంప్ వివరించారు. ఇది చాలా అన్యాయం అంటూనే.. భారత దేశం తమపై 100 శాతం కంటే ఎక్కువ సుంకాలు వసూలు చేస్తుందన్నారు. తమ ఉత్పత్తులపై చైనా సగటు సుంకం యూఎస్ వసూలు చేసే దాని కంటే 2 రెట్లు ఎక్కువ అని చెప్పారు. అలాగే దక్షిణ కొరియా సగటు సుంకం 4 రెట్లు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు అమెరికాకు సమయం వచ్చిందని.. ఆయా దేశాలు ఎంత సుంకాలు విధిస్తే తాము కూడా అంతే విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. ముఖ్యంగా చైనా, భారత్లపై ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రకటించిన సుంకాలను అమలు చేస్తామన్నారు. దీని వల్ల అమెరికా సంపన్నంగా మారుతుందని స్పష్టం చేశారు. అయితే ఏప్రిల్ 1వ తేదీ నుంచే దీన్ని అమలు చేయాలని ముందుగా భావించానని.. కానీ ఏప్రిల్ పూల్ అనే మీమ్స్ బారిన పడడం ఇష్టం లేకే దీన్ని 2వ తేదీకి వాయిదా వేసినట్లు తెలిపారు.
భారత్కు ట్రంప్ భారీ షాక్.. ఏప్రిల్ 2 నుంచే ప్రతీకార సుంకాలు అమలు
RELATED ARTICLES